18 ఏళ్లకే సహజీవనం తప్పుకాదు.. అది వారి హక్కు : హైకోర్టు సంచలన తీర్పు

by  |
Cohabitation
X

దిశ, వెబ్‌డెస్క్ : యువతీ యువకులకు ఇష్టం ఉంటే సహజీవనం చేయవచ్చని హైకోర్టు తీర్పు చెప్పింది. ఇద్దరికి సమ్మతి ఉంటే వివాహ వయసు లేకున్నా సహజీవనం చేయడంలో తప్పు లేదని స్పష్టం చేసింది. హిందు వివాహ చట్టం ప్రకారం అబ్బాయికి 21 ఏళ్లు నిండాలి కానీ.. 18 నిండితే మేజరేనని, రాజ్యంగం కల్పించిన హక్కులను అతడు పొందవచ్చని పేర్కొంది. 2018లో వయోజనులైన స్త్రీ, పురుషుడు వివాహం లేకుండానే సహజీవనం చేసుకోవచ్చంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అనుసరిస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టు ఈ తీర్పు చెప్పింది.

పంజాబ్‌లోని గురుదాస్ పూర్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల వయసున్న యువతీ యువకుడు ప్రేమించుకున్నారు. వారి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. అయితే హిందు వివాహ చట్టం ప్రకారం అబ్బాయికి 21 ఏళ్లు నిండితేనే వివాహం చేసునే అర్హత ఉంటుందని, వారి సహజీవనం చెల్లదని కుటుంబ సభ్యులు వారిని విడదీయడానికి ప్రయత్నించారు. దీంతో ప్రేమికులు ఇద్దరు హైకోర్టును ఆశ్రయించారు. తమను వేరు చేయాలని చూస్తున్నారని, వారి నుంచి ప్రాణ హాని కూడా ఉన్నదని, రక్షణ కల్పించాలని పిటిషన్ వేశారు.

ప్రేమికులు పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ‘‘రాజ్యాంగం ప్రకారం పౌరుల ప్రాణాలు, స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని.. పిటిషనర్ (పురుషుడు) వివాహ వయసుకు చేరుకోలేదన్నది నిజం. కానీ ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి.. యువకుడికి వివాహ వయస్సు రాకపోయినా.. భారతీయ పౌరుడిగా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను పొందకుండా చేయడం సరికాదు’’ అని పేర్కొంది. ఇరువురి అంగీకారంతో సహజీవనం చేయటం అనేది వారి ప్రాథమిక హక్కుఅని స్పష్టం చేస్తు.. పిటిషనర్ల దరఖాస్తును పరిశీలించి, వారి ప్రాణాలకు ముప్పు ఉంటే తగిన రక్షణ కల్పించాలంటూ గురుదాస్ పూర్ ఎస్ఎస్‌పీని జస్టిస్ హర్నరేష్ సింగ్ ఆదేశించారు.

ఫ్లాష్.. ఫ్లాష్.. ఆ ఉద్యోగులకు KCR సర్కార్ న్యూ ఇయర్ గిఫ్ట్…భారీగా జీతాలు పెంచుతూ అధికారిక ఉత్తర్వులు

Next Story

Most Viewed