కాగ్నిజెంట్ త్రైమాసిక ఫలితాలు!

by  |
కాగ్నిజెంట్ త్రైమాసిక ఫలితాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో నికర ఆదాయం 16.7 శాతం తగ్గి రూ. 2,789 కోట్లుగా ఉంది. 2019 ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ. 441 కోట్లుగా నమోదైంది. త్రైమాసిక ఆదాయం 2.8 శాతం పెరిగి సుమారు రూ. 31 వేల కోట్లుగా ఉంది. 2019-20 త్రైమాసికంలో ఇది సుమారు రూ. 30 వేల కోట్లుగా ఉండేది. రాన్‌శామ్ అటాక్ కారణంగా ప్రస్తుతం త్రైమాసికంలో రూ. 375 కోట్ల నుంచి రూ. 525 కోట్లకు తగ్గిందని అంచనా వేసింది. కాగ్నిజెంట్ నిర్వహణ ఖర్చు మార్చి త్రైమాసికంలో 15.1 శాతం ఉంది. అంతకుముందు త్రైమాసికంలో ఇది 17 శాతంగా నమోదైంది. సంస్థ డిజిటల్ రెవెన్యూ 41 శాతం ఉండగా, అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో 19 శాతంగా నమోదైంది. ఉద్యోగుల జీతాల కోసం రూ. 195 కోట్లను ఖర్చు చేసింది. ఏప్రిల్ నాటికి కాగ్నిజెంట్ సుమారు రూ. 13 వేల కోట్ల రుణాన్ని తగ్గించుకుంది. కాగ్నిజెంట్ సంస్థకు ఇండియాలో 2 లక్షల మంది ఉద్యోగులున్నారు. 20,000 నియామకాలను డిజిటల్ స్కిల్స్ డెవలప్‌మెంట్‌లో పెట్టుబడిగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు, దీనికోసం 20,000 కొత్త నియామకాలను చేపట్టనున్నట్టు వెల్లడించింది. సంస్థకు 41 శాతం డిజిటల్ సర్వీసెస్ ద్వారా ఆదాయం సమకూరింది.

Tags: Covid-19, Companies, Cognizant Q1 Results, Profit

Next Story

Most Viewed