సైబర్‌ నేరగాళ్లకు చిక్కిన సీఎండీ రఘుమారెడ్డి

by  |
సైబర్‌ నేరగాళ్లకు చిక్కిన సీఎండీ రఘుమారెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: సైబర్ క్రిమినల్స్ ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అమాయకులనే కాకుండా అధికారులను సైతం మోసం చేయడానికి వారు ఏమాత్రం వెనుకాడటం లేదు. తాజాగా.. ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డిని లక్ష్యంగా చేసుకొని మోసం చేయాలని చూశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఫోన్ చేసి పాన్ కార్డు, ఆధార్ కార్డు పంపించాలని కోరారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా.. రఘుమారెడ్డి వారికి కార్డులు పంపించారు. చివరకు అది ఫేక్ కాల్ అని గుర్తించి, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు.



Next Story

Most Viewed