నేడు శ్రీశైలం వెళ్లనున్న ముఖ్యమంత్రి

by  |
నేడు శ్రీశైలం వెళ్లనున్న ముఖ్యమంత్రి
X

దిశ, ఏపీ బ్యూరో: సీఎం వైఎస్ జగన్ శుక్రవారం శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో సున్నిపెంట హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి జెన్కో గెస్ట్ హౌస్ కు వెళ్తారు. అనంతరం శ్రీశైలం డ్యామ్ ను సందర్శించనున్నారు. మధ్యాహ్నం 12.30కు ఏరియల్ సర్వే ద్వారా కర్నూలు జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులను పరిశీలించి విజయవాడ చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed