ధర్మపథం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

by  |
ధర్మపథం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వం ధర్మపథం అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ఈ ధర్మపథం అనేకార్యక్రమాన్ని దుర్గగుడిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఇతర అధికారులతో కలిసి ధర్మపథం కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ధర్మపథం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed