ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫారమ్‌లు అందజేసిన సీఎం వైఎస్ జగన్

by  |
ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫారమ్‌లు అందజేసిన సీఎం వైఎస్ జగన్
X

దిశ, ఏపీ బ్యూరో: స్ధానిక సంస్ధల కోటాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వరుదు కళ్యాణి, డాక్టర్ మెుండితోక అరుణ్‌కుమార్‌లు గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు శాలువా కప్పి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వరుదు కళ్యాణి, మెుండితోక అరుణ్‌కుమార్‌లకు బీ ఫారమ్‌లు అందజేశారు.


Next Story