స్టాలిన్ మరో సంచలనం.. చెన్నైలో సైబర్ క్రైం సెంటర్ ఏర్పాటు

by  |
స్టాలిన్ మరో సంచలనం.. చెన్నైలో సైబర్ క్రైం సెంటర్ ఏర్పాటు
X

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనదైన మార్క్ పాలనను చూపిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేయడంలోనే కాక పౌరుల భద్రత దృష్ట్యా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దేశంలోనే ఐటీ, ఇండస్ట్రీలకు హబ్‌గా ఉన్న చెన్నైలో ఇటీవల సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే వాటికి చెక్ పెట్టేందుకు రాజధానిలో సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.

ఈ విషయాన్ని మంగళవారం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. సైబర్ క్రైం సెంటర్ ఏర్పాటుచేయడం వలన భవిష్యత్‌లో ఆర్థిక, ఇంటర్నెట్ సంబంధిత నేరాలను నియంత్రించడంలో పోలీసులకు ఎంతగానో ఉపయోగపడుతుందని సీఎం స్టాలిన్ అభిప్రాయం వ్యక్తంచేశారు. చెన్నై కేంద్రంగా సైబర్ నేరాల నియంత్రణకు గాను ఈ సెంటర్ నోడల్ ఏజెన్సీగా పనిచేయనుందని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.


Next Story