నేడు సీఎం సమీక్ష.. చర్చించనున్న అంశాలివే!

by  |
నేడు సీఎం సమీక్ష.. చర్చించనున్న అంశాలివే!
X

దిశ, వెబ్ డెస్క్: నేడు మధ్యాహ్నం 2 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై చర్చించనున్నారు. పరీక్షల నిర్వహణపై ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాలపై చర్చించనున్నారు. ప్రీఫైనల్ పరీక్షల మార్కులో ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వడంతో పాటు మూడు ప్రతిపాదనలను విద్యాశాఖ సీఎం సమీక్ష కోసం సిద్ధం చేసింది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారా.. లేక పూర్తిగా రద్దు చేస్తారా అనే అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.



Next Story

Most Viewed