గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం సమీక్ష

by  |
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం సమీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: నల్గొండ, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్‌లో సమావేశం అయ్యారు. కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఈనెల 1న ప్రారంభమైన గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు వచ్చేనెల 6వరకు కొనసాగుతోందని, అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్టీ చేపడుతున్న సంక్షమే పథకాలు, ధరణి వెబ్‌సైట్‌పై చర్చిస్తున్నారు.

Next Story

Most Viewed