మేడ్చల్‌లో సీఎం రిలీఫ్ ఫండ్ అందజేత

by  |
cm-fun
X

దిశ,మేడ్చల్ టౌన్: సీఎం సహాయనిధి ఆపదలో ఉన్న పేద ప్రజలకు ఒక గొప్ప వరమని గుండ్ల పోచంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ 1వ వార్డుకు చెందిన పెంటయ్యకు సీఎం సహాయనిధి 52 వేల రూపాయలు చెక్కును లక్ష్మీ అందజేశారు. సీఎం సహాయనిధి కోసం కృషి చేసిన మంత్రి మల్లారెడ్డికి మేడ్చల్ మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్ రజితావెంకటేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం సహాయనిధి చాలా మంది పేద ప్రజలకు వరంగా మారిందని కౌన్సిలర్ రజిత అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వీణా సురేందర్ గౌడ్, గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు వెంకటేష్, శ్రీనివాస్, నాగరాజు, రమేష్ , తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed