క్షేత్రస్థాయిలో పర్యటన.. నివారణ చర్యల పరిశీలన

by B.Srinivas |

<p>దిశ, న్యూస్‌బ్యూరో : కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో తెలుసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. లాక్‌డౌన్ అమలు, ప్రజల కోసం తీసుకుంటున్న చర్యలపై పరిశీలించాల్సిందిగా మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. స్వయంగా వారే పర్యటించి వివరాలను పరిశీలించాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి, మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ [&hellip;]</p>

దిశ, న్యూస్‌బ్యూరో :
కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో తెలుసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. లాక్‌డౌన్ అమలు, ప్రజల కోసం తీసుకుంటున్న చర్యలపై పరిశీలించాల్సిందిగా మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. స్వయంగా వారే పర్యటించి వివరాలను పరిశీలించాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి, మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ బుధవారం సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు.

Tags: Corona, Field tour, Video conferance, CM KCR, DGP

Next Story