‘పీకే’‌కు జెడ్‌ప్లస్ భద్రత..

by  |
‘పీకే’‌కు జెడ్‌ప్లస్ భద్రత..
X

ప్రముఖ రాజకీయ వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే‌కు జెడ్‌ప్లస్ కేటగిరి భద్రతను కల్పిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనంతటికి కారణం 2021 బెంగాల్‌లో జరగనున్నఅసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు పీకే రాజకీయ వ్యుహకర్తగా వ్యవహరించడమే.ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీ నుంచి గట్టి పోటి ఉంటుందని భావించిన దీదీ ముందస్తు వ్యుహంలో భాగంగానే పీకే‌ను వ్యుహకర్తగా నియమించుకుని, అతనికి జెడ్‌ప్లస్ భద్రత కల్పించిందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గత సార్వత్రిక ఎన్నికల్లో అధికంగా ఎంపీ సీట్లను బీజేపీ కైవసం చేసుకోవడమే మమత భయానికి కారణంగా తెలుస్తోంది.

Next Story