కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు..

by  |
కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు..
X

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ఆందోళన తారా స్థాయికి చేరింది. కేంద్రంతో రైతు సంఘాల నేతలు జరిపిన చర్చలు ఎంతకూ కొలిక్కిరాలేదు. ఈ నేపథ్యంలోనే కొత్త చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు మంగళవారం భారత్ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఢిల్లీ పోలీసులు గృహ నిర్భంధం చేశారు. ఇంట్లో నుంచి ఎవరినీ బయటకు రానివ్వడం, పోనివ్వడం గానీ చేయడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతకుముందు కేజ్రీవాల్ రైతుల నిరసన చేస్తున్న సింధ్ ప్రాంతానికి వెళ్లి రైతులను పరామర్శించారు. రైతుల ఆందోళనకు ఢిల్లీ ముఖ్యమంత్రి పరోక్షంగా కారణం కావొచ్చనే నేపథ్యంలో ఆయన్ను హౌస్ అరెస్టు చేసినట్లు బీజేపీ నేతలు ఆరోపిస్తుండగా.. ఢిల్లీ పోలీసులను బీజేపీ పోలీసులుగా ఆప్ నేతలు అభివర్ణిస్తున్నారు.

Next Story

Most Viewed