నేడు సీఎం కేసీఆర్‌ దత్తపుత్రిక వివాహం

by  |
నేడు సీఎం కేసీఆర్‌ దత్తపుత్రిక వివాహం
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌ దత్తపుత్రిక ప్రత్యూష వివాహ నేడు జరుగనుంది. సోమవారం హైదరాబాద్‌లోని రాంనగర్‌కు చెందిన ఉడుముల జైన్ మేరీ, మర్రెడ్డి దంపతుల కుమారుడితో అధికారులు వివాహం జరపనున్నారు. వరుడి స్వగ్రామం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం అల్లాల గ్రామ పంచాయతీ పరిధిలోని పాటిగడ్డ లూర్దుమాత చర్చిలో ఉదయం 10 గంటలకు ప్రత్యూష, చరణ్‌రెడ్డి వివాహం క్రైస్తవ సంప్రదాయం ప్రకారం నిర్వహించేందుకు ప్రభుత్వ అధికారులు, వరుడి బంధువులు ఏర్పాట్లను పూర్తిచేశారు. ఈ వివాహానికి రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, ఐఏఎస్‌ అధికారులు రఘునందన్‌రావు, మహిళా సంక్షేమ శాఖ కమిషనర్‌ దివ్యదేవరాజ్‌, ఐసీడీఎస్‌ ఉన్నత అధికారులు హాజరుకానున్నారు.

Next Story

Most Viewed