ప్రగతిభవన్‌లో పంద్రాగస్టు వేడుకలు

by  |
ప్రగతిభవన్‌లో పంద్రాగస్టు వేడుకలు
X

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రతి ఏటా గోల్కొండ కోటలో జరిగే పంద్రాగస్టు వేడుకలు ఈసారి ప్రగతి‌భవన్‌కు షిప్ట్ అయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎలాంటి హడావుడి లేకుండా ఈసారి అధికారిక నివాసం ప్రగతి భవన్‌కే వేడుకలు పరిమితం కానున్నాయి. శనివారం ఉదయం 10.15 గంటలకు సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. కేవలం 20మంది అతిథులు మాత్రమే హాజరయ్యేలా ఆదేశాలు జారీ అయ్యాయి. మంత్రులు, సీఎస్, సీఎంవో అధికారులు పాల్గొననున్నారు. జిల్లాల్లో ఇంచార్జి మంత్రులు, ప్రభుత్వ విప్‌లు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు.



Next Story

Most Viewed