31న కొడకండ్లకు సీఎం కేసీఆర్ రాక

by  |
31న కొడకండ్లకు సీఎం కేసీఆర్ రాక
X

దిశ ప్రతినిధి, వరంగల్: ఈ నెల 31వ తేదీన సీఎం కేసీఆర్ జనగామ జిల్లా కొడకండ్లకు రానున్నారు. మండల కేంద్రంలో మధ్యాహ్నం 12.30 గంటలకు రైతు వేదికను ప్రారంభించనున్నారు. అనంతరం రైతు వేదిక సమీపంలోని పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించనున్నారు.ఈ సందర్భంగా రైతులు, ప్రజలను ఉద్దేశించి ప్రసగించనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణాన్ని చేపట్టిన ఉద్దేశం, ఆవశ్యకత, దీని ద్వారా జరిగే కార్యకలాపాలను సీఎం కేసీఆర్ వివరించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రైతుబంధు జిల్లా, మండల, గ్రామ కమిటీలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు.

Next Story

Most Viewed