ఫ్లాష్.. ఫ్లాష్.. గాంధీ ఆస్పత్రికి సీఎం కేసీఆర్

by  |
CM KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్​ మరికాసేపట్లో గాంధీ ఆస్పత్రి పరిశీలనకు వెళ్లనున్నారు. ప్రస్తుతం వైద్యారోగ్య శాఖ బాధ్యతలను చూస్తున్న సీఎం తొలిసారిగా గాంధీకి వెళ్తున్నారు. ఇప్పటి వరకు సీఎంగా కేసీఆర్​ గాంధీ వైపే వెళ్లలేదు. ప్రస్తుతం గాంధీలో ఆక్సిజన్​, వెంటిలేటర్ల సమస్య ఉండటం, కరోనా ఆస్పత్రిగా మార్చిన అనంతరం సౌకర్యాలు లేవంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన టూర్ ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్​ నాలుగైదుసార్లు గాంధీకి వెళ్లారు. వాస్తవానికి గాంధీలో చికిత్సలపై ఇటీవల సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్లను టార్గెట్​ చేస్తూ సోషల్​ మీడియాలో ట్రోల్​ చేస్తున్నారు. ఇద్దరికీ కరోనా పాజిటివ్​ వచ్చిన నేపథ్యంలో గాంధీలో ట్రీట్​మెంట్​కు చేరాలంటూ సెటైర్లు వేశాయి ప్రతిపక్షాలు.

మరోవైపు గాంధీలో కరోనా మరణాలు ఎక్కువగా ఉంటున్నాయని, కనీసం సౌకర్యాలు కల్పించడం లేదంటూ ఆరోపణలు వచ్చాయి. సిబ్బందికి, రోగులకు, రోగుల సహాయకులకు భోజనాలు కూడా పెట్టడం లేదంటూ శనివారం నుంచి కాంగ్రెస్​ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సీఎం కేసీఆర్​… వైద్యారోగ్య శాఖ మంత్రిగా గాంధీ ఆస్పత్రి పరిశీలనకు వెళ్తున్నారు. గతంలో గవర్నర్​ నరసింహన్​ పలుమార్లు గాంధీని పరిశీలించారు. కానీ పరిస్థితులేమీ మారలేదు. ఆ తర్వాత గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ గాంధీపై పలుమార్లు వివరాలు తీసుకున్నా స్వయంగా వెళ్లి పరిశీలించలేదు. ప్రస్తుతం సీఎం కేసీఆర్​ వెళ్తుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.



Next Story

Most Viewed