ఎట్టిపరిస్థితుల్లో వారిని వదిలిపెట్టం: సీఎం కేసీఆర్

by  |
ఎట్టిపరిస్థితుల్లో వారిని వదిలిపెట్టం: సీఎం కేసీఆర్
X

దిశ, మెదక్: కలప దొంగలను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో గురువారం ఆరో విడత హరితహారాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘ కలప దొంగలకు తీవ్రమైన హెచ్చరిక చేస్తున్నా, మిమ్మల్ని ఈ ప్రపంచంలో ఎవరూ కాపాడలేరు. అడువులకు సంబంధించి ఇంటెలిజెన్స్‌లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశాం. ఎక్కడ చీమ చిటుక్కుమన్నా నిమిషాల మీద నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. నిర్ధాక్షిణ్యంగా మిమ్మల్ని శిక్షించేది ఖాయం.’ అని సీఎం హెచ్చరంచారు. ఆరో విడత హరితహారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 30 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 34 శాఖల సమన్వయంతో రాష్ట్ర అటవీ శాఖ ఈ బాధ్యతను నిర్వహిస్తుంది.

Next Story

Most Viewed