హల్దీ వాగులోకి నీటిని విడుద‌ల చేసిన‌ సీఎం కేసీఆర్

by  |
CM KCR
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్దిపేటలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి సంగారెడ్డి కాల్వలో పారుతున్న కాళేశ్వర జలాలను.. వర్గల్‌ మండలం అవుసులపల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్‌ నుంచి హల్దీ కాల్వలోకి విడుదల చేశారు. దీంతో ఏళ్లుగా నీరు లేక వెలవెలబోతున్న హల్దీ వాగు మండుటెండలోనూ నీటితో నిండనుంది. ప్రాజెక్ట్‌ నుంచి నీరు వర్గల్‌ మండలం తునికిఖాల్సా మీదుగా అంబర్‌పేటలోని ఖాన్‌ చెరువకు చేరుతుంది. అనంతరం ఖాన్‌ చెరువు నుంచి హల్దీ వాగుకు ఆ తర్వాత తూఫ్రాన్‌, వెల్లుర్తి, చిన్న శంకరంపేట మీదుగా కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలకు సాగునీరు చేరనుంది. ఈ పర్యటనలో స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు హ‌రీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాక‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డితో పాటు ప‌లువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed