వీఆర్వోల సర్దుబాటుకు సీఎం హామీ

by  |
వీఆర్వోల సర్దుబాటుకు సీఎం హామీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రెవెన్యూ శాఖలో పదోన్నతులను, బదిలీలను చేపడుతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్​ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సిద్ధిపేట జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా వచ్చినప్పుడు సంఘం నాయకులు సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఆ సమయంలో వీఆర్వోలను సర్దుబాటు చేస్తామని, వీఆర్ఏలకు పే స్కేలు త్వరలోనే వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే సిద్ధిపేట జిల్లాలో అసోసియేషన్ బిల్డింగ్​ నిర్మాణం కోసం కావల్సిన నిధుల మంజూరుకు అంగీకారం తెలిపారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాలని ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ కు సూచించారు. సీఎం కేసీఆర్ ను కలిసిన వారిలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డితో పాటు సెంట్రల్​ కార్యవర్గ సభ్యులు, తహశీల్దార్లు అన్వర్, యాదగిరి రెడ్డి, శ్రీనివాసరావు, రెహమాన్, విజయ సాగర్​, రామేశ్వర్, రాజేశంలు ఉన్నారు.



Next Story

Most Viewed