కాళేశ్వరం మూడో టీఎంసీ పనుల పూర్తిపై సీఎం ఆదేశాలు

by  |
కాళేశ్వరం మూడో టీఎంసీ పనుల పూర్తిపై సీఎం ఆదేశాలు
X

దిశ, న్యూస్‌బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూడో టీఎంసీని తరలించే పనులతో పాటు, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీ నిర్మాణ పనులను త్వరిగగతిన పూర్తిచేయాలని, దీనికి సంబంధించిన నిధుల సమీకరణ ప్రక్రియను పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, వాటికి నిధుల సమీకరణ అంశంపై మంగళవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఈ ఆదేశాలిచ్చారు. నీటి లభ్యత కలిగిన సమయంలో ప్రతీరోజు గోదావరి నుంచి 4 టీఎంసీలు, కృష్ణా నుంచి 3 టీఎంసీల చొప్పున నీటిని తరలించి రాష్ట్రంలోని కోటి 25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి ప్రాజెక్టులను నిర్మిస్తున్నట్లు చెప్పారు.

బడ్జెట్ నిధులతో పాటు వివిధ సంస్థల నుంచి నిధులను సేకరిస్తున్నామని, ఇప్పటికే దాదాపు అన్ని ప్రాజెక్టులకు సంబంధించి వివిధ సంస్థలతో ఆర్థిక సహాయానికి సంబంధించి ఒప్పందాలు పూర్తయ్యాయని సీఎం వెల్లడించారు. ప్రభుత్వం తరపున కట్టాల్సిన వాటాను చెల్లించి, వెంటనే నిధుల సమీకరణ ప్రాసెస్ పూర్తి చేయాలని, వర్షాకాలం పూర్తి కాగానే అన్ని ప్రాజెక్టుల పనులు వేగవంతం కావాలని సీఎం సూచించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, ఈఎన్సీ మురళీధర్‌రావు పాల్గొన్నారు.

Next Story