- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో రెండో రోజూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ క్రమంలో కేంద్రంతో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా వరిధాన్యం కొనుగోళ్లు, పెట్రో ధరలు, ఉద్యోగ నోటిఫికేషన్లపై మట్లాడారు. అంతేగాకుండా.. ఇకపై ప్రతిరోజూ ప్రెస్ మీట్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఇక రోజూ మీరు(జర్నలిస్టులు) ప్రగతి భవన్కి రావాలని, మీకు ఇక్కడే భోజనం ఏర్పాట్లు కూడా చేస్తామని జర్నలిస్టులకు తెలిపారు. అంతేకాకుండా, ఎవరు ఏం చెబుతే అది రాయకుండా తెలుసుకొని రాయాలని కోరారు. ఈ సందర్భంగా దీనిపై పెద్దగా వార్త రాయాలంటూ మరోసారి జర్నలిస్టు రాహుల్ను కోరారు. కరోనా సమయంలో సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. జర్నలిస్ట్ రాహుల్ పేరును ప్రస్తావిస్తూ పలుమార్లు మాట్లాడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సోషల్ మీడియాలో జర్నలిస్ట్ రాహుల్ ఫేమస్ అయ్యారు. తాజాగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి రాహుల్ పేరును ప్రస్తావించడంతో నెట్టింట వైరల్గా మారింది.