నేడు కలెక్టర్లతో సీఎం కేసీఆర్ భేటీ

by  |
నేడు కలెక్టర్లతో సీఎం కేసీఆర్ భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు అన్ని శాఖల మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ఉదయం 11.30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ నెల 16 నుంచి కరోనా టీకా ప్రారంభం కానుండగా.. రాష్ట్రానికి రేపు టీకాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల నిల్వ, వినియోగం తదితర వాటిపై చర్చించనున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, పురపాలక, వైద్యారోగ్య, స్కూళ్ల పున: ప్రారంభంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

విద్యా సంస్థలను పూర్తిస్థాయిలో తెరవడంపై సాధ్యాసాధ్యాల పరిశీలన, ధరణి వెబ్‌పోర్టల్ నిర్వహణకు సంబంధించిన అంశాలతోపాటు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన పనుల పురోగతిపై చర్చించనున్నట్లు సమాచారం. సమావేశం తర్వాత సీఎం కేసీఆర్‌తో త్రిసభ్య కమిటీ భేటీ కానుంది.


Next Story

Most Viewed