సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన కేసీఆర్

by  |
సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న అనంతరం కొత్త సచివాలయ నిర్మాణ పనుల దగ్గరకు వెళ్లిన సీఎం కేసీఆర్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ వెంట రోడ్డు భవనాల శాఖ మంత్రి వేములు ప్రశాంత్‌రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, ఆర్‌అండ్‌బీ అధికారులు, ఇంజినీర్లు ఉన్నారు. రూ.617 కోట్లతో ప్రభుత్వ కొత్త సచివాలయం నిర్మిస్తుండగా.. ముంబైకి చెందిన షాపూర్‌జీ ఫల్లోంజీ సంస్థ పనులు దక్కించుకున్న విషయం తెలిసిందే.



Next Story

Most Viewed