ఆ రెండు ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయండి: సీఎం కేసీఆర్

by  |
ఆ రెండు ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయండి: సీఎం కేసీఆర్
X

దిశ,వెబ్ డెస్క్: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరకు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల పురోగతిపై సీఎం కేసీఆర్ శనివారం సమీక్ష నిర్వహించారు. పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డిండి ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచి, 6 నెలల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. రెండు ప్రాజెక్టులకు ఈ ఏడాది బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని చెప్పారు. మస్కూరీలను నీటి పారుదల శాఖలో విలీనం చేసి లష్కర్లుగా వినియోగించాలని సూచించారు.



Next Story

Most Viewed