జిల్లాలకు ఇన్‌చార్జీలుగా వారిని ఫిక్స్ చేసిన సీఎం

by  |
జిల్లాలకు ఇన్‌చార్జీలుగా వారిని ఫిక్స్ చేసిన సీఎం
X

దిశ, వెబ్‌డెస్క్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం బాధ్యతలను సీఎం కేసీఆర్ మంత్రులకు అప్పగించారు. శుక్రవారం హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్, ఖమ్మం- నల్లగొండ- వరంగల్ జిల్లాల పట్టభద్రుల స్థానాల్లో ప్రచారంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల వారిపై మంత్రులకు గెలుపు బాధ్యతలను అప్పగించారు. జిల్లాల వారిగా ఇన్ చార్జీలను నియమించారు.

రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జ్‌గా మంత్రి హరీశ్ రావు, హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జ్‌గా మంత్రి గంగుల కమలాకర్, మహబూబ్ నగర్ జిల్లా ఇన్‌చార్జ్‌గా మంత్రి ప్రశాంత్ రెడ్డిని నియమించారు. దీంతో గెలుపుపై మంత్రులకు టెన్షన్ మొదలైంది. కాగా ఖమ్మం- నల్లగొండ- వరంగల్ జిల్లాలకు కేటాయించాల్సి ఉంది.


Next Story

Most Viewed