రామలింగారెడ్డి మృతి పట్ల కేసీఆర్ దిగ్ర్భాంతి

by  |
రామలింగారెడ్డి మృతి పట్ల కేసీఆర్ దిగ్ర్భాంతి
X

దిశ, గజ్వేల్: దుబ్బాక ఎమ్మెల్యే, శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో సహచరుడిగా, ఒకే ప్రాంతవాసిగా రామలింగారెడ్డితో తనకు ఎంతో అనుబంధం ఉందని సీఎం గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.

Next Story

Most Viewed