రేపు సెలవు ప్రకటించిన సీఎం కేసీఆర్

by  |
cm-kcr
X

దిశ, డైనమిక్ బ్యూరో : గులాబ్ తూపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, తాజా పరిస్థితులపై సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్ సోమవారం సాయంత్రం సమీక్షించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశమున్నందున రాష్ట్రంలోని అన్నిపాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రేపు మంగళ వారం (28-9-2021 )సెలవు ప్రకటిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. సీఎం ఆదేశాలననుసరించి తగు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిని సీఎస్ ఆదేశించారు. అయితే, అత్యవసర శాఖలైన రెవెన్యూ, పోలీస్, ఫైర్ సర్వీసులు, మున్సిపల్, పంచాయతీ రాజ్, నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖలు విధి నిర్వహణలో ఉండాలని, భారీ వర్షాల వాళ్ల ఏవిధమైన ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చూడాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.



Next Story

Most Viewed