నవంబర్‌ 4న ఏలూరుకు సీఎం జగన్..

by  |
నవంబర్‌ 4న ఏలూరుకు సీఎం జగన్..
X

దిశ, ఏపీ బ్యూరో: నవంబర్ 4న ఏలూరులో సీఎం వైఎస్ జగన్‌ పర్యటించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను శనివారం డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అధికారులతో కలిసి పరిశీలించారు. తంగెళ్లమూడి వద్ద రిటైనింగ్‌ వాల్‌‌కు శంకుస్థాపన చేయనున్న జగన్.. అనంతరం మాజీ మేయర్‌ నూర్జాహాన్​ పెద్దబాబు కుమార్తె వివాహానికి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ ఏలూరు నగరానికి వరద ముప్పు తప్పించేందుకు నాడు వైఎస్ ​నిధులు కేటాయించినట్లు గుర్తు చేశారు. అప్పుడు 40శాతం రిటైనింగ్ వాల్ నిర్మించినట్లు తెలిపారు. వైఎస్‌ మరణానంతరం దీనిపై ఎవరూ చొరవ చూపలేదని, నేడు సీఎం జగన్​ సహకారంతో రూ. 78 కోట్లతో మిగిలిన పనులకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు.


Next Story

Most Viewed