రేపు విజయనగరంలో సీఎం జగన్‌ పర్యటన

by  |
రేపు విజయనగరంలో సీఎం జగన్‌ పర్యటన
X

దిశ,విశాఖపట్నం : ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా బుధవారం విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. గుంకలాంలో భారీ కాలనీలో పట్టాలు పంపిణీ, ఇళ్లనిర్మాణ పనులను సీఎం ప్రారంభించనున్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి, 11:15 గంటలకు గుంకలాం చేరుకోనున్నారు. పైలాన్‌ ఆవిష్కరణ అనంతరం ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. మధ్యాహ్నం 2.45 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు. సిఎం పర్యటన నేపథ్యంలో కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌,ఎస్పీ రాజకుమారి ఆధ్వర్యంలో ఏర్పాట్ల పనులు పర్యవేక్షిస్తున్నారు.

Next Story

Most Viewed