రేపు ఢిల్లీకి సీఎం జగన్.. అమిత్‌షాతో భేటీ

by  |
jagan-cm
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగే తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొననున్నారు. దాదాపు రెండ్రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఇకపోతే అమిత్‌షాతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రత్యేక హోదా అంశంతోపాటు దిశబిల్లుపై కూడా సీఎం జగన్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే టీటీడీ ఆహ్వానితుల కమిటీపైనా కూడా వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం.

Next Story