పోలీసులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం.. ఇవాళ్టి నుంచే..

by  |
CM-Jagan-12
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ పోలీసులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరై మాట్లాడారు. పోలీసుల సేవలు అమోఘం.. అందుకే వారి సేవలను గుర్తించి దేశంలో మొట్ట మొదటిసారిగా పోలీసులకు వీక్లీ ఆఫ్ ప్రకటించామని, అయితే, కోవిడ్ కారణంగా పోలీసులకు వీక్లీ ఆఫ్ ను అమలు చేయలేకపోయాం.. ప్రస్తుతం వైరస్ ప్రభావం తగ్గడంతో నేటి నుంచి దీన్ని అమలు చేయబోతున్నామని సీఎం చెప్పారు. ఈ విషయం తెలిసి పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed