- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని ప్రాజెక్టులపై ఏపీ సీఎం జగన్ బుధవారం ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విజయనగరం జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే, తొటపల్లి రిజర్వాయర్ పనులను కూడా వేగంగా పూర్తిచేయాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్-2 పూర్తికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనంతరం వంశధార ప్రాజెక్టు రెండోదశ పనులపై సీఎం జగన్ ఆరా తీశారు. నేరడి ప్రాజెక్టు నిర్మాణానికి తగు చర్యలు చేపట్టాలని, పొలవరం పునరావాస పనుల్లో నాణ్యాతా ప్రమాణాలు పాటించాలన్నారు. అంతేకాకుండా, గండికోటలో 26.85టీఎంసీలు, చిత్రావతిలో 10టీఎంసీల నీరు నిల్వ ఉంచేలా చూడాలన్నారు. రాజోలి, జోలదిరాశి పనుల త్వరితగతిన మొదలు పెట్టాలని సీఎం ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
Next Story