ఎమ్మెల్యేను పరామర్శించిన సీఎం జగన్

by  |
ఎమ్మెల్యేను పరామర్శించిన సీఎం జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి రెండోసారి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భూమనను శనివారం సీఎం జగన్ పరామర్శించారు. ఎమ్మెల్యేతో ఫోన్‌లో మాట్లాడి చికిత్సకు సంబంధించిన వివరాలు తెలసుకున్నారు. అనంతరం ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి భూమన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మరిన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ ఎమ్మెల్యేకు సూచించారు.

Next Story

Most Viewed