మీరిచ్చేది చాలట్లేదు.. ప్రధాని మోడీకి జగన్ లేఖ

by  |
మీరిచ్చేది చాలట్లేదు.. ప్రధాని మోడీకి జగన్ లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్ : భారత ప్రధాని నరేంద్రమోడీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం లేఖ రాశారు. రాష్ట్రానికి కేటాయిస్తున్న 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరిపోవడం లేదని, ఏపీలో నెలకొన్న అత్యవసర పరిస్థితుల దృష్ట్యా 910 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ కేటాయించాలని లేఖ ద్వారా ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

అదే విధంగా కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు టెక్నాలజీ బదిలీ అంశాన్ని పరిశీలించాలని జగన్ కోరారు. కాగా, ఇటీవల ఆక్సిజన్ అందక తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో 11 మందికి పైగా కోవిడ్ రోగులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీకి ఏపీ ముఖ్యమంత్రి లేఖ రాసినట్లు సమాచారం.



Next Story

Most Viewed