సీఎం జగన్ వాహనం వెంట పరుగులు తీసిన మహిళ

by  |
Woman Run
X

దిశ, రాయలసీమ : రేణిగుంట ఎయిర్ పోర్ట్‌లో ఆదివారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తిరుపతిలో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో పాల్గొనడానికి ఏపీ సీఎం జగన్ తిరుపతికి వెళ్తు్న్నారు. ఈ నేపథ్యంలో రేణిగుంట ఎయిర్ పోర్ట్ చేరుకున్న జగన్ తన కాన్వాయ్ లో తిరుపతికి బయలుదేరారు. అయితే అలా మొదలై సీఎం కాన్వాయ్ వెంబడి ఓ మహిళ పరిగెత్తుతూ వచ్చింది. ఇది గమనించిన సీఎం జగన్ కాన్వాయ్‌ని నిలిపివేయించి ఓఎస్డీని మహిళ దగ్గరకు పంపించారు. అంతేకాకుండా ఆ మహిళ వివరాలు తెలుసుకున్నారు. ఆ మహిళ తనకు ఉద్యోగం కావాలని ఆ విషయం సీఎం జగన్‌కు తెలిపేందుకు పరిగెత్తానని తెలపడంతో ఆమెకు ఉద్యోగ అవకాశం కల్పిస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు.

Next Story