అగ్నిప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

by  |
అగ్నిప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం ప్రమాద ఘటనపై ఆయన ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ లో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. మంటల్లో చిక్కి 10 మంది కరోనా పేషెంట్లు మృతిచెందిన విషయం విధితమే.

Next Story

Most Viewed