మావయ్యా కాలు నొప్పి తగ్గిందా..? సీఎం జగన్‌ను అడిగిన విద్యార్థినిలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-12-03 03:52:57  IST  )

<p>దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్తూరు జిల్లాలోని వరద సంభవించిన ప్రాంతాల్లో శుక్రవారం పర్యటిస్తున్నారు. వరద బాధితులను నేరుగా సీఎం జగన్ పరామర్శిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి అందరికీ అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. అయితే గుత్తివారిపల్లెలో పర్యటిస్తుండగా సీఎం జగన్‌ను చూసేందుకు జిల్లాపరిషత్ విద్యార్థినిలు బయటకు వచ్చారు. జగన్ మావయ్యా అంటూ పలకరించారు. దీంతో వారిని సీఎం జగన్ పలకరించారు. వారితో కలిసి సెల్ఫీ దిగారు. ఇంతలో విద్యార్థిని జగన్ మావయ్యా కాలు నొప్పి [&hellip;]</p>

మావయ్యా కాలు నొప్పి తగ్గిందా..? సీఎం జగన్‌ను అడిగిన విద్యార్థినిలు
X

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్తూరు జిల్లాలోని వరద సంభవించిన ప్రాంతాల్లో శుక్రవారం పర్యటిస్తున్నారు. వరద బాధితులను నేరుగా సీఎం జగన్ పరామర్శిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి అందరికీ అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. అయితే గుత్తివారిపల్లెలో పర్యటిస్తుండగా సీఎం జగన్‌ను చూసేందుకు జిల్లాపరిషత్ విద్యార్థినిలు బయటకు వచ్చారు. జగన్ మావయ్యా అంటూ పలకరించారు. దీంతో వారిని సీఎం జగన్ పలకరించారు. వారితో కలిసి సెల్ఫీ దిగారు. ఇంతలో విద్యార్థిని జగన్ మావయ్యా కాలు నొప్పి తగ్గిందా అంటూ పలకరించారు. తగ్గింది తల్లీ థాంక్యూ అమ్మా అంటూ సీఎం జగన్ నవ్వుతూ సమాధానం చెప్పారు. ఇదే సమయంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సీఎం జగన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

Follow our Facebook page: https://www.facebook.com/DishaAndhranews

Next Story