నర్సాపురం ప్రేమోన్మాది ఘటనపై సీఎం జగన్ ఆరా..

by  |
cm jagan
X

దిశ, వెబ్‌డెస్క్ : మరొకరితో చనువుగా ఉంటుందనే అనుమానంతో ప్రియురాలు అనూషను, విష్ణువర్ధన్ రెడ్డి అనే యువకుడు దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి నేరుగా పోలీసు‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

ఈ ఘటన గుంటూరు జిల్లా నర్సాపురంలో వెలుగులోకి రాగా.. ముఖ్యమంత్రి జగన్ ఈ హత్య ఉదంతంపై స్పందించారు. బాధితురాలి కుటుంబానికి రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంతో పాటు నిందితుడిపై దిశ చట్టం కింద కేసు నమోదు చేసి తగిన శిక్ష పడేలా చూడాలన్నారు. అంతకుముందు అనూష మృతి పట్ల సీఎం జగన్ దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు.


Next Story

Most Viewed