దయనీయ పరిస్థితుల్లో… ఆ ఆసుపత్రులు : భట్టి

by  |
దయనీయ పరిస్థితుల్లో… ఆ ఆసుపత్రులు : భట్టి
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్ప‌త్రిని బుధవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, స్థానిక ఎమ్మెల్యే పొదెం వీరయ్యతో కలిసి సంద‌ర్శించారు. అనంతరం ఆసుపత్రిలో కల్పిస్తున్న సదుపాయాలను, అక్కడి రోగులను, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…

రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు దయనీయ పరిస్థితుల మ‌ధ్య కొన‌సాగుతున్నాయ‌ని ఆరోపించారు. స‌మ‌స్య‌లున్నాయ‌ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా… ప‌ట్టించుకోకుండా మొద్దునిద్ర‌తో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని, ఆసుపత్రుల్లో సిబ్బంది ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆస్ప‌త్రిని పరిశీలించిన బృందం, అక్కడి సదుపాయాలపై అసంతృప్తిని వెలిబుచ్చింది.

Next Story

Most Viewed