రాత్రి 10గంటలకు రామాలయం మూసివేత

by  |
రాత్రి 10గంటలకు రామాలయం మూసివేత
X

దిశ, ఖమ్మం: సూర్య గ్రహణం కారణంగా ఇవాళ రాత్రి 10 గంటల నుంచి భద్రాచలంలోని రామాలయం ద్వారాలు మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. గ్రహణం అనంతరం 21వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు ఆలయ ద్వారాలను తెరవడం జరుగుతుందని చెప్పారు. ఆలయ శుద్ధి సంప్రోక్షణ అనంతరం స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం వరకు ఆలయ ద్వారాలు మూసివేస్తున్న కారణంగా భక్తులను దర్శనానికి అనుమతించే అవకాశం లేదు.



Next Story

Most Viewed