- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ముధోల్ : ఇటీవల గ్రామాల్లో, పట్టణాల్లో కొందరు.. తమ సమస్యలను పరిష్కరించాలంటూ వాటర్ ట్యాంకులు, సెల్ టవర్స్ ఎక్కి నిరసనకు దిగుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనే కుంటాల మండలం లింబ(కే) గ్రామంలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. లోకేశ్వరం మండలంలోని నగర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్కు.. కుంటాల మండలంలోకి లింబ(కే) గ్రామానికి చెందిన ఓ మహిళతో ఐదు నెలల క్రితం వివాహం జరిగింది. అయితే, ఇటీవల భార్యాభర్తల మధ్య కొన్ని సమస్యల కారణంగా గొడవలు జరిగాయి. దీంతో, భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది.
ఈ నేపథ్యంలో సోమవారం శ్రీనివాస్.. లింబ(కే) గ్రామానికి వెళ్ళి భార్యను తనతో ఇంటికి రావాలని కోరాడు. ఆమె అందుకు నిరాకరించడంతో శ్రీనివాస్ ఆవేదన చెందాడు. ఈ క్రమంలో గ్రామంలో ఉన్న సెల్ టవర్ ఎక్కి తన భార్య.. తనతో రాకపోతే కిందకు దూకుతానంటూ హల్ చల్ చేశాడు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతనికి నచ్చజెప్పి కిందికి దించే ప్రయత్నం చేస్తున్నారు.