టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. 16 మందికి క్లీన్‌చిట్

by  |
PURI
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 16 మంది సినీ సెలబ్రెటీలకు క్లీన్ చిట్ లభించింది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరో తరుణ్‌, రవితేజ, తనీష్, నందు, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, నవదీప్, చార్మీ, ముమైత్ ఖాన్ లతో పాటు పలువురికి FSL క్లీన్ చిట్ ఇచ్చింది. ఇద్దరూ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆనవాళ్లు లేవని తేల్చింది. ఈ మేరకు ఛార్జ్ షీట్‌లో ఎక్సైజ్ శాఖ పేర్కొంది. 2017లో పూరీ, తరుణ్ ల నుంచి రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలను అధికారులు సేకరించి గత ఏడాది డిసెంబర్ 8న ఎక్సైజ్ శాఖకు FSL నివేదిక సమర్పించింది. ప్రధాన నిందితుడు కెల్విన్ కు రంగారెడ్డి జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో డిసెంబర్ 9న విచారణకు హాజరుకావాలని కెల్విన్ కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.


Next Story