భగ్గుమన్న పాతకక్షలు

by  |
భగ్గుమన్న పాతకక్షలు
X

దిశ వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. జిల్లాలోని ఏఎస్ పేట మండలంలో వైసీపీకి చెందిన ఓ వర్గం నేతలపై మరో వర్గం నేతలు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకెళితే…గుడి పాడుకు చెందిన మాజీ ఎంపీటీసీ దేవరాల హజరత్తయ్య, అతని అనుచరుడు ప్రభాకర్ రెడ్డిపై వైసీపీ నాయకుడు తిరుపతి రెడ్డి వర్గీయులు దాడి చేశారు. హజరత్తయ్య, ప్రభాకర్ రెడ్డిలు బైక్ పై వెళుతుండగా తిరుపతి రెడ్డి వర్గీయులు గమనించారు. వారిపై వెనక నుంచి దాడి చేసి సమీపంలోని ముళ్ల పొదల్లో పడవేశారు. కాగా తీవ్రగాయాలతో ఉన్న వారిద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed