తమిళనాడులో పట్టుబడ్డ నగదుపై క్లారిటీ..

by Vadlamudi Anukaran |   (  Updated:2020-07-16 04:25:08  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో ఏపీకి చెందిన మంత్రి స్టిక్కర్ అంటించిన కారులో పట్టుబడిన బంగారం, నగదుపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. అందులో లభ్యమైన రూ.5.27కోట్ల నగదు, గోల్డ్ తమదేనని ఒంగోలు బంగారం వ్యాపారి నల్లమల్లి బాలరామ గిరీశ్ అంగీకరించాడు. లాక్ డౌన్ వలన 3నెలలుగా నగదు తమవద్దే ఉండిపోయిందని.. దానిని తమిళనాడులోని బంగారం సరఫరా దారులకు ఇచ్చేందుకు తీసుకెళ్తుండగా పట్టుకున్నారని చెప్పుకొచ్చాడు. అది అక్రమ నగదు కాదని.. దానికి సంబంధించిన లెక్కలు తన వద్ద ఉందని [&hellip;]</p>

తమిళనాడులో పట్టుబడ్డ నగదుపై క్లారిటీ..
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో ఏపీకి చెందిన మంత్రి స్టిక్కర్ అంటించిన కారులో పట్టుబడిన బంగారం, నగదుపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. అందులో లభ్యమైన రూ.5.27కోట్ల నగదు, గోల్డ్ తమదేనని ఒంగోలు బంగారం వ్యాపారి నల్లమల్లి బాలరామ గిరీశ్ అంగీకరించాడు. లాక్ డౌన్ వలన 3నెలలుగా నగదు తమవద్దే ఉండిపోయిందని.. దానిని తమిళనాడులోని బంగారం సరఫరా దారులకు ఇచ్చేందుకు తీసుకెళ్తుండగా పట్టుకున్నారని చెప్పుకొచ్చాడు. అది అక్రమ నగదు కాదని.. దానికి సంబంధించిన లెక్కలు తన వద్ద ఉందని చెప్పాడు. ఈ నగదుకు మంత్రి బాలినేనికి ఎలాంటి సంబంధం లేదని గిరీశ్ వెల్లడించాడు.

Next Story