నేడు తిరుమలకు సీజేఐ ఎన్వీ రమణ.. షెడ్యూల్ వివరాలు ఇవే.!

by  |
nv-ramana
X

దిశ, వెబ్‌డెస్క్ : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ గురువారం తిరుమలకు రానున్నారు. గురువారం మధ్యాహ్నం తిరుపతికి చేరుకొని తిరుచానూరుకు వెళ్లి.. పద్మావతి అమ్మవారిని దర్శించుకొని అనంతరం తిరుమలకు చేరుకుంటారు.

ఈరోజు అక్కడే బస చేసి.. శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2:15 గంటలకు ఎన్వీ రమణ తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు.


Next Story