శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న సీజేఐ బాబ్డే

by  |
శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న సీజేఐ బాబ్డే
X

దిశ, ఏపీ బ్యూరో: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్​ఏ బాబ్డే శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బాబ్డే‌కు ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి స్వాగ‌తం ప‌లికారు. ఆల‌యంలో భార‌త ప్రధాన న్యాయమూర్తికి టీటీడీ చైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం బాబ్డే వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. రంగ‌నాయ‌కుల మండ‌పంలో వేద‌పండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీ‌వారి తీర్థ ప్రసాదాలు, చిత్రప‌టం ఆయనకు అందించారు. అనంతరం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని బాబ్డే దర్శించుకున్నారు.

Next Story

Most Viewed