- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రైల్వే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సీఐటీయూ ధర్నా

దిశ ప్రతినిధి, ఖమ్మం: దేశంలో అత్యధిక ప్రజల రవాణా సాధనమైన కీలక రైల్వే రంగాన్ని ప్రైవేటీకరించే కేంద్ర ప్రభుత్వం చర్యలు వ్యతిరేకిస్తూ సీఐటీయూ, యూటీఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఖమ్మం రైల్వే స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు తుమ్మ విష్ణువర్ధన్ అధ్యక్షతన జరిగిన సభలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బండి నరసింహారావు మాట్లాడుతూ.. దేశంలో 109 రైలు మార్గాల్లో 151 ప్రయివేటు ప్యాసింజర్ రైళ్లను నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. దీనివలన ఆ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు, దేశంలోని కోట్లాది మంది ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతోందన్నారు. రైల్వే ప్రైవేటీకరణ జరిగితే రైలు చార్జీలు భారీగా పెరిగి ప్రజలపై తీవ్రమైన భారాలు పడతాయని, రవాణా చార్జీలు కూడా బాగా పెరిగి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. రైల్వే ప్రైవేటీకరణను అడ్డుకోవడం మన దేశంలో ఉండే ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలందరూ ఐక్య పోరాటాలకు కలిసి రావాలని కోరారు.