- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సినిమా : బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ ‘సూర్యవంశీ’ కంప్లీట్ అయి దాదాపు ఏడాదిన్నర గడిచింది. కానీ కరోనా కారణంగా ఇంకా థియేటర్లో రిలీజ్ కాలేదు. దీంతో డైరెక్టర్ రోహిత్ శెట్టి మరో మూవీ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. రణ్వీర్ సింగ్, వరుణ్ శర్మ, పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కాంబినేషన్లో ఆల్రెడీ మూవీ ప్రకటించాడు. ‘ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్’రీమేక్గా వస్తున్న సినిమాకు ‘సర్కస్’ టైటిల్ ఫైనల్ కాగా.. రణ్వీర్ వైఫ్, టాలెంటెడ్ హీరోయిన్ దీపికా పదుకునే గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతుందట.
రోహిత్ శెట్టి దర్శకత్వంలో 2013లో వచ్చిన చెన్నై ఎక్స్ప్రెస్లోని మీనమ్మ క్యారెక్టర్తో మరోసారి ఆడియన్స్కు జబర్దస్త్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వనుందట. మీనమ్మ క్యారెక్టర్ దీపికా కెరియర్లోనే ది బెస్ట్ కాగా.. ఆడియన్స్ను థియేటర్స్కు తీసుకొచ్చేందుకు డైరెక్టర్ ఇలాంటి ప్రయోగం చేస్తున్నాడని తెలుస్తోంది. రణ్వీర్-దీపికాల కెమిస్ట్రీని ఎంజాయ్ చేసేందుకు చాలా మంది ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. సినిమా మొత్తం లేకపోయినా కనీసం సాంగ్, లేదంటే సీన్లో అయినా ఇద్దరిని చూడాలని కోరుకుంటున్నారు. అందుకే రోహిత్ ఇలాంటి ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.