- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంక్రాంతి జోడీలు ఫిక్స్.. వెంకటేష్, కళ్యాణ్ రామ్ల హీరోయిన్లు ఎవరంటే?
వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా, హిట్ మిషన్ డైరెక్టర్ అనీల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్గా ఫిక్స్ అయినట్లు టాక్.

దిశ, సినిమా: బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి తన మల్టీస్టారర్ చిత్రం అనౌన్స్చేసినప్పటి నుంచి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది. ఈ కొత్త ప్రాజెక్టులో విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి దగ్గుబాటి, నందమూరి కుటుంబాల నుంచి వచ్చిన స్టార్స్ని కలిపి ఈ కొత్త చిత్రాన్ని ఒక క్లీన్, టిపికల్ అనిల్ ఎంటర్టైనర్గా అందరికీ కనెక్ట్ అయ్యే కథాంశంతో రూపొందిస్తున్నారు. కంప్లీట్ ఎంటర్టైనర్గా ఉండబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం పీ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే.. ఈ చిత్రానికి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త నెట్టింట సందడి చేస్తూనే ఉంది.
ఈ క్రమంలోనే వెంకటేష్కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కళ్యాణ్ రామ్కు కూడా జోడీ ఫిక్స్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం. ఈ మేరకు ఇందులో కళ్యాణ్కు జోడీగా కృతి శెట్టి హీరోయిన్గా ఫిక్స్ అయిందట. ఇక వెంకటేష్, కీర్తి సురేష్ - కళ్యాణ్ రామ్, కృతి శెట్టి సంక్రాంతి జోడీలు సందడి చేసేందుకు సిద్ధం అవుతున్నారు.. త్వరలోనే దీనిపై త్వరలోనే అఫీషియల్ అప్డేట్ రాబోతుంది అంటూ వార్తలు వైరల్ అవుతుండగా.. మంచి ప్లానే వేశాడు అనిల్ రావిపూడి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అలాగే ఈ సినిమాతో అయిన యంగ్ బ్యూటీ కృతి శెట్టికి మంచి హిట్ పడాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. కాగా.. ఈ చిత్రం 2027 సంక్రాంతి స్పెషల్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.






